హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో కాలనీ లేదా బస్తీల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. దీన్ని పలు వార్డుల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నది. బుధవారం హైదరాబాద్లో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్రాజ్ సమావేశమయ్యారు. కొత్త విధానంపై పార్టీ నేతలకు జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు. ఓట్ల జాబితా కంప్యూటీకరణపై పలు పార్టీల నేతలు తమ సందేహాలను వ్యక్తం చేశారు. సీఈవో వికాస్ రాజ్ మాట్లాడుతూ జాబితా కంప్యూటీకరణ మొత్తం కేంద్రం ఎన్నికల సంఘం చేతుల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అదే విధంగా కొత్త ఓటర్ల నమోదుపై నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాలను వారికి వివరించారు.