ఖమ్మం, మార్చి 4: సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసస్నమైందని జర్మన్ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) పీడీ నాయకురాలు సుష అన్నారు. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా ఆలిండియా యూనిటీ మహాసభలు ఖమ్మంలోని(డీవీకే, భాసర్ నందినగర్) భక్త రామదాసు కళాక్షేత్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభ సూచకంగా పీసీసీ సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ కార్యదర్శి సుభాష్దేవ్ అరుణ పతాకాన్ని ఆవిషరించగా.. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆహ్వానం పలికారు.
మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది వడ్డెల్లి కృష్ణమూర్తి సందేశం ఇచ్చి.. ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుష ప్రసంగిస్తూ పోరాట పఠిమను మరింతగా ప్రదర్శించేందుకు విప్లవ పార్టీలు ఏకమై మాస్లైన్గా ముందుకెళ్లడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(మసాల్) కేంద్ర నాయకుడు ఠాగూర్ కనాల్ మాట్లాడుతూ.. మూడు విప్లవ పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఆవిర్భవించడం అంతర్జాతీయ ముఖచిత్రంలో మంచి పరిణామమని చెప్పారు. మహాసభలు ప్రారంభానికి ముందు ప్రతినిధులు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. వేదికపై యూనిటీ మహాసభల ఆర్గనైజింగ్ నాయకులు ప్రదీప్సింగ్ ఠాగూర్, పోటు రంగారావు, సుభాష్దేవ్, సంజయ్సింగ్ వీ, దేవత శర్మ, కే రమ, కేజీ రామచందర్, రిషి ఆశీనులయ్యారు.