హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రయాణికుల సమస్యలకు పరిష్కారం చూపుతున్న వీసీ సజ్జనార్ మరో సోషల్మీడియా వేదికలో అందుబాటులోకి వచ్చారు. తాజాగా టెలిగ్రామ్లోనూ ‘టీఎస్ఆర్టీసీ ఎండీ ఆఫీస్’ పేరిట ఖాతా ప్రారంభించారు. ట్విట్టర్లో ఇప్పటికే సజ్జనార్కు ఫాలోవర్లు 57 వేల వరకు ఉన్నారు. టీఎస్ఆర్టీసీ సేవలపై ప్రజలు నిత్యం ట్విట్టర్ వేదికగా నేరుగా సజ్జనార్తో పంచుకుంటున్నారు. ఇదే రీతిలో ఆయన సైతం స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్స్ డేను పురస్కరించుకొని ఆర్టీసీ డ్రైవర్లందరికీ ఎండీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు.