హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 ( నమస్తే తెలంగాణ ) : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం.. శుక్రవారం విజేతల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సెన్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో ఉన్నతవిద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశపత్రాలను అందజేసింది.
ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు 150 కంపెనీలు బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, బీబీఏ, బీఫార్మసీ, బీఏ విద్యార్థులను ప్రాంగణా నియామకాలకు ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు తెలిపా యి. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ సీతారామయ్య, ప్రొఫెసర్ జీ శివకుమార్, డాక్టర్ మోతహర్ రెజా, డాక్టర్ బందన్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.