హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ నేలపై జరిగిన మహోన్నత చరిత్రాత్మక ఘట్టాలను, యథార్థ చరిత్రను చాటిచెప్పడం ద్వారా తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నవారికి దీటైన సమాధానం చెప్పారని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కొనియాడారు. శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో కేసీఆర్ ఇచ్చిన సందేశంతో ప్రజల్లో ధైర్యం, నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయని పేర్కొన్నారు. చాలా ఆందోళనలో ఉన్న ఆలోచనాపరులందరికీ ఒక భరోసా కలిగించినట్టు అయ్యిందని జూలూరు ఒక ప్రకటనలో తెలిపారు.