Kotha Prabhakar Reddy | సిద్దిపేట(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ దుబ్బాక, అక్టోబర్ 30: నిందితుడు గటాని రాజును అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టినట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీని కలిసేందుకు వచ్చి, కత్తితో కడపులోకి బలంగా పొడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న రాజును అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని పేర్కొన్నారు. నిందితుడు మిరుదొడ్డి మండలం చెప్యాలకు చెందినవాడని తెలిపారు.
కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు.. ఇటీవల బీజేపీ నాయకులతో సంబంధాలు పెంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్గానూ పనిచేస్తున్నాడు. వివాదాస్పదుడిగా రాజుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో చోట, ఒక్కో రకంగా జర్నలిస్టునంటూ, రాజకీయ నేతనంటూ పలువురిని బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేవాడని స్థానికులు చెప్పారు.