Gas KYC | నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, డిసెంబర్ 30: వినియోగదారులకు గ్యాస్ ఈ-కేవైసీ కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల ముందు నిత్యం బారులుతీరుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏజెన్సీ కార్యాలయం తెరవకముందే వేకువజాము నుంచి క్యూ కడుతున్నారు. కేవైసీ చేయడంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తాత్సారం చేస్తుంటడంతో వినియోగదారులు గంటల తరబడి వరుసలో నిలబడి ఇబ్బందులు పడాల్సివస్తున్నది. కొన్ని పట్టణాల్లో గ్యాస్ ఏజెన్సీల వారు వినియోగదారులకు టో కెన్లు ఇచ్చి తరువాత రమ్మంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గంటలు కొద్దీ బారులుతీరి అప్ డేట్ చేయించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇదే అదునుగా గ్యాస్ కంపెనీ నిర్వాహకులు వినియోగదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. బెల్లంపల్లిలోని భారత్ గ్యాస్ నిర్వాహకులు రూ.200 పెట్టి గ్యాస్ పైపు కొనాలనే షరతు విధించినట్టు తెలిసింది. ఆ పైపు ఇంటికి వచ్చి బిగించేందు కు మరో రూ.200 వసూలు చేస్తున్నట్టు సమాచారం. గ్యాస్బుక్లో పేర్లు మార్చుకునేందుకు వచ్చే వారి వద్ద రూ.1300 తీసుకుంటున్నట్టు పలువురు వినియోగదారులు పేర్కొన్నారు.
ఆధార్ కార్డుల్లో మార్పులు-చేర్పుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలకు ఆధార్, రేషన్ కార్డులు తప్పనిసరి చేసింది. దరఖాస్తుతోపాటు రెండు కార్డులు జతపర్చాలని సూ చించింది. దీంతో తమ ఆధార్ కార్డుల్లో కు టుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడం, ఇతర మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేం ద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఆధార్ సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొందరు టిఫిన్లు తెచ్చుకొని అక్కడే భోజనాలు చేస్తున్నారు. ఇంకొందరు చంటి పిల్లలతో వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు.