రాజన్న సిరిసిల్ల, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల రూరల్: రెం డు మూడు రోజుల్లో వస్త్ర పరిశ్రమను పునఃప్రారంభిస్తామని సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం తెలిపారు. బుధవారం సంఘం కార్యాలయంలో మీడియా తో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూ.13 కోట్ల విలువైన 69.50 లక్షల మీటర్ల ఆర్వీఎం వస్త్ర తయారీ ఆర్డర్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. పాలిస్టర్ వస్త్ర నిలువలు పేరుకుపోవడంతో బంద్ చేశామని, ఇందులో రాజకీయ ప్రయోజనాలు లేవన్నారు. కాగా పరిశ్రమలు బంద్ చేయకుండా తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్పార్క్లో బుధవారం కార్మికులు ఆందోళనకు దిగారు.