కోదాడ: సూర్యాపేట జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని కోదాడ సమీపంలో ఉన్న రామాపురం క్రాస్రోడ్ చెక్పోస్టు వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. బస్సులో అక్రమంగా తరలిస్తుండగా 30 కిలోల గజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అరెస్టుచేశారు. గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాన్ని తెలసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.