Hyderabad | బన్సీలాల్పేట్, ఏప్రిల్ 20: జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ యువకుడి కడుపులో నుంచి తొమ్మిది మేకులను గాంధీ దవాఖాన వైద్యులు తొలగించారు. శనివారం గాంధీ దవాఖాన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం హెచ్వోడీ, ప్రొఫెసర్ శ్రావణ్కుమార్ వివరాలను వెల్లడించారు.
తీవ్రమైన కడుపునొప్పితో యువకుడు నాలుగురోజుల క్రితం దవాఖానలోని ఖైదీల వార్డులో చేరాడు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఎక్స్రే, ఇతర పరీక్షలు నిర్వహించి అతడి కడుపులో ఇనుప మేకులు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను బయటకు తీశారు.