ఆదిలాబాద్ : బాసర రైల్వే స్టేషన్ను మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సందర్శించారు. వేద విద్యార్థుల వేద మంత్రోచ్చరణల మధ్య జీఎంకు ఘన స్వాగతం పలికారు. బాసర పుణ్యక్షేత్రం మీదుగా ప్రత్యేక రైళ్లు నిలిపేలా కృషి చేయాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జీఎం గజానన్ మాల్యాను కోరారు.
కోవిడ్ 19 కారణంగా నిలిచిపోయాయి ప్యాసింజర్ రైళ్లను నెల లోపు ప్రారంభిస్తామని జీఎం తెలిపారు. డిసెంబర్ లోపు బాసర రైల్వే స్టేషన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. సుమారు గంట పాటు బాసర రైల్వే స్టేషన్లో పర్యటించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబధిత రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.