హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రజాగాయకుడు గద్దర్ 75వ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘75 ఏండ్ల పాట-25 ఏండ్ల తూట’ పేరుతో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ ధూంధాం రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి అంతడుపుల నాగరాజు తెలిపారు. బంజారాహిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్పై కాల్పులు జరిగిన రోజు యావత్ దేశానికి గుర్తున్నదని, అదేరోజు ఆయన పుట్టినరోజు కూడా అని గుర్తుచేశారు. పలువురు కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు.