వీణవంక, జూన్ 18: అగ్నిపథ్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లు, ఆయా రాష్ర్టాల్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తే భవిష్యత్తులో దేశంలో అంతర్గత యుద్ధం రాబోతుందా? అని ప్రజాగాయకుడు గద్దర్ అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలుబాక గ్రామానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయంతో ఆర్మీ అభ్యర్థులకు ఆగ్రహం తెప్పించి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైందన్నారు. ఇప్పటికైనా కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని గద్దర్ తెలిపారు.