G Vinod | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రివర్గ కూర్పుపై కరసత్తు చేస్తున్నది. అయితే, ముఖ్యమంత్రి పదవికి పలువురు కీలక నేతలు పోటీపడుతున్నారు. నిన్ననే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. ప్రమాణస్వీకారానికి రాజ్భవన్లో సైతం ముమ్మర ఏర్పాట్లు జరిగాయి. ఈ క్రమంలో పార్టీ పరిశీలకుల సమావేశంలో సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీఎం ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగించారు. సీఎం పదవి, కేబినెట్ బెర్తుల విషయంలో పంచాయితీ నేపథ్యంలో వాయిదాపడింది. ముఖ్య నేతలు పట్టువీడకపోవడంతో డీకే శివకుమార్తో పాటు పరిశీలకులను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లు సైతం ఢిల్లీలో మకాం వేశారు. ఎవరికి వారు తమ బెర్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా మరో నేత సైతం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఆయనే బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జీ వినోద్. ఈ క్రమంలో ఢిల్లీలో మకాం వేసిన ఆయన మంగళవారం కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అయితే, వినోద్ సోదరుడు సైతం వివేక్ చెన్నూరు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అంతకు ముందు ఆయన బీజేపీ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి చెన్నూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం అన్నాదమ్ముళ్లు ఇద్దరు మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే, ఇద్దరిలో ఒకరికి మాత్రమే పదవి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వినోద్ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. తాను గతంలో మంత్రిగా పని చేశానని.. తనకు మరోసారి కేబినెట్లో అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. మరో వైపు వివేక్ మాత్రం హైదరాబాద్లోనే ఉండి మంతనాలు చేస్తున్నారు. సీఎం రేసులో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు. మంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్లో చేరేందుకు వివేక్ సమ్మతించారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నాదమ్ముళ్లు ఇద్దరు కేబినెట్ బెర్తు కోసం లాబీయింగ్ చేస్తున్నారు.
సోనియా సమావేశం అనంతరం మీడియాతో వినోద్ మాట్లాడుతూ.. తాను 2004-2009 వరకు మంత్రిగా పని చేశానన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశంతో మరోసారి కేబినెట్లో చోటు చేసుకోసం రెక్వెస్ట్ కోసం ఢిల్లీకి వచ్చానని.. ఈ మేరకు సోనియాకు విజ్ఞాపనపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. మంత్రి పదవి ఖాయమనే సంకేతాలున్నాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎంపికపై సీనియర్లు చర్చలు జరుపుతున్నారన్నారు. ఇవాళ లేదంటే రేపు సీఎంను ప్రకటించే అవకాశం ఉందన్నారు. 7వ తేదీన.. లేదంటే 9న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంటుందన్నారు. సీఎం అభ్యర్థిత్వంపై మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ చర్చలు జరుపుతున్నారన్నారు. ఎమ్మెల్యేల అందరికీ అభిప్రాయాలను తీసుకొని హైకమాండ్కు పంపారన్నారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తాను వెంకటస్వామి కొడుకునని.. హైకమాండే లా అన్నారు. ఏ ఆదేశాలు ఇచ్చినా స్వీకరిస్తామని.. నాకున్న అనుభవంతో మంత్రిత్వ శాఖ ఇచ్చినా మేనేజ్ చేయగలుగుతానన్నారు. ఐదేళ్లపాటు ఎలాంటి రిమార్క్ లేకుండా వైఎస్ కేబినెట్లో పని చేశానని.. తనకు మంచి అవగాహన ఉందన్నారు. తన సేవలను ఏలాగైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.