హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులను మోసగించిన సైబర్ చీటర్, బీజేపీ నాయకుడు సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్గౌడ్, అతడి బావమరిది గణేశ్తోపాటు శ్రావణ్, వీరబాబును గురువారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
న్యాయస్థానం ఈ నలుగురిని నాలుగురోజులపాటు విచారించేందుకు కస్టడీకి అనుమతించింది. మొదటి రోజైన గురువారం నిందితులను పలు అంశాలపై సైబర్క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. కాల్ సెంటర్ నిర్వహణ ఎలా చేస్తున్నారు? టెలికాలర్స్, సిమ్కార్డులపై వివరాలు సేకరించినట్టు తెలిసింది.