హైదరాబాద్ : వచ్చే నెల 6, 7 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లుజన్ సదస్సు జరుగనున్నది. సదస్సుకు అన్ని జీ20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. జీ20 సదస్సుతో పాటు పలు వాణిజ్య సదస్సులు సైతం జరుగనున్నాయని విదేశాంగశాఖ అధికారి ముక్తేశ్ పరదేశి తెలిపారు. అలాగే మార్చి 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సమావేశాలు జరుగనున్నాయి.