హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : గీతం డీమ్డ్ యూనివర్సిటీతో రాజమండ్రిలోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ (ఐసీఎస్ఈ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నట్టు వర్సిటీ వీసీ దయానంద సిద్దవట్టం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్యూచర్ కిడ్స్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం ఉద్దేశమని వెల్లడించారు. ఒప్పంద పత్రాలపై గీతం రిజిస్ట్రార్ డీ గుణశేఖరన్, ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏలేటి రుద్రశ్రీ మహస్వి సంతకాలు చేసినట్టు తెలిపారు. కాగా, గీతం వర్సిటీలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 61 యూనిట్ల రక్తాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది దానం చేశారు.