హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలోని విద్యాశా ఖ అధికారుల బృందం గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నది. ఆ రాష్ట్రంలో పాఠశాలలు, గుజరాత్ స్కిల్ యూనివర్సిటీ, విద్యా సమీక్ష కేంద్రం (వీఎస్ కే) వంటి విద్యాసంస్థల పనితీరుపై అధ్యయనం చే యనున్నది.
స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు నేపథ్యంలో ఒడిశా, ఢిల్లీ, గుజరాత్ రాష్ర్టాల్లోని స్కిల్ వ ర్సిటీలను ఇంటర్బోర్డు సెక్రటరీ శృతి ఓజా, ఇతర అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఈ బృందం కర్ణాటకలో అధ్యయనం చేసింది.