హైదరాబాద్, జూన్ 12: ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.20 తగ్గింది. ఇక నుంచి లీటర్ నూనె గరిష్ఠ ధర(ఎంఆర్పీ) రూ.200 అని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే, ప్రస్తుతం స్టోర్లలో రూ.220 స్టాకు ఉన్నదని, కొద్ది వారాల్లో తగ్గించిన ధరలతో స్టాకు అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఫ్రీడమ్ ఆయిల్పై ఇటీవలే రూ.15 తగ్గించారు.