హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని అబిడ్స్లో నిర్మించనున్న తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు రాంజీగోండు మ్యాజియానికి సోమవారం భూమిపూజ చేయనున్నారు. మాసబ్ట్యాంకులోని సంక్షేమభవన్ ప్రాంగణంలో నిర్మించిన ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టీఆర్ఐ) భవనాన్ని సైతం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్తోపాటు పలువురు మం త్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలు గుస్సాడి కనకరాజు, సకిని రామచంద్రయ్య, కుమ్రంభీం వారసుడు కుమ్రం సోనేరావు, రాంజీగోండు వంశీయుడు మర్సకోల తిరుపతి తదితరులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. రాంజీగోండు మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అబిడ్స్లో రూ.200 కోట్ల విలువ చేసే ముప్పావు ఎకరం స్థలంతోపాటు రూ. 25 కోట్లు మంజూరు చేసింది. ఈ మ్యూజి యం సెల్లార్లో పార్కింగ్, గ్రౌండ్ఫ్లోర్లో లైబ్రరీ, మొద టి, రెండో అంతస్థుల్లో మ్యూజియం, రాంజీగోండు జీవిత విశేషాల చిత్రాలతోపాటు మరో గోండు యోధుడు కుమ్రంభీం జీవిత విశేషాలు, ఆదివాసీ గిరిజన జీవన చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు.
ప్రారంభానికి ముస్తాబవుతున్న టీఆర్ఐ భవన్
మాసబ్ట్యాంకు సంక్షేమభవన్ ప్రాంగణంలో నిర్మించిన టీఆర్ఐ భవనం ప్రారంభానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. జీ ప్లస్ 3 విధానంలో ని ర్మించిన ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో లైబ్రరీ, మొద టి అంతస్థులో టీఆర్ఐ కార్యాలయం, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో శిక్షణ, డైనింగ్ వసతులు కల్పించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సముచిత గౌర వం కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుమ్రం భీం నడయాడిన జోడేఘాట్లో మ్యూజియం, ము లుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ మ్యూ జియం, ఖమ్మంలో ట్రైబల్ మ్యూజియం, హైదరాబాద్లో కుమ్రంభీం ఆదివాసీభవన్, సంత్సేవాలాల్ మహారాజ్ బంజారా భవనాలు నిర్మించింది.
గిరిపుత్రులకు వరం బీఆర్ఎస్: సత్యవతిరాథోడ్
గిరిపుత్రులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వరం అని మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతికి పాటుపడుతున్నదని తెలిపారు. మేడారం, నాగోబా, జంగూబాయి జాతరలతోపాటు కుమ్రం భీం వర్ధంతి, సంత్సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పా రు. ఇటీవల గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పైగా పోడుభూములకు పోడుపట్టాలు అందజేశామని గుర్తుచేశారు. అత్యంత విలువైన భూమిని రాంజీగోండు మ్యూజియానికి కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.