అబిడ్స్, నవంబర్ 24: తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, స్వాతంత్య్ర సమరయోధు డు పీ పురుషోత్తం గుప్తా అనారోగ్యంతో శుక్రవారం ఉద యం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దిల్సుఖ్నగర్కు చెందిన ఈయన 1969న తొలిదశ ఉద్యమం లో పాలుపంచుకున్నారు. 2001లో బీఆర్ఎస్లో చేరి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. ఈయన కోడలు మమతాసంతోష్ గుప్తా 2014లో గన్ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్గా విజ యం సాధించారు. ఆయన కుమారుడు సంతోష్గుప్తా బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. పురుషోత్తం మృతదేహాన్ని దిల్సుఖ్నగర్లోని ఆయన నివాసానికి తరలించగా, బీఆర్ఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి, మమతాసంతోష్గుప్తాను పరామర్శించారు. అనంతరం పురుషోత్తం గుప్తా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.