హిమాయత్నగర్, అక్టోబర్18: వ్యవసాయ, వ్యయసాయేతర రంగాల్లో యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెంటర్ ఫర్ ఆంత్రోప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ (సీఈడీ) నోడల్ అధికారి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెట్ల పెంపకం, పోషణ, అగ్రి వ్యాపారంపై 45 రోజులపాటు హైదరాబాద్ కూకట్పల్లిలోని సీఈడీ సంస్థలో ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు వ్యవసాయ అనుబంధ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను పూర్తి చేసి, తెలంగాణకు చెందిన వారై ఉండాలని సూచించారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. వివరాలకు 7036666421/422/424 నంబర్లను సంప్రదించాలని కోరారు.