హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 18 నుంచి 30 ఏండ్ల లోపు నిరుద్యోగులకు 45 రోజుల ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగం కల్పిస్తామని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ కిశోర్రెడ్డి తెలిపారు. ఆటోమొబైల్, టూ వీలర్ సర్వీసింగ్, సెల్ఫోన్ -ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, బేసిక్ కంప్యూటర్స్ – ఇంగ్లిష్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, డిజైనర్ బ్లౌజ్ మేకింగ్, క్విల్టెడ్ బ్యాగ్స్ మేకింగ్, జూనియర్ లైన్మన్ పరీక్షకు శిక్షణ ఇస్తామని వివరించారు. 26న ఉదయం 10 గంటలకు యాదాద్రి జిల్లా జలాల్పూర్ గ్రామంలోని స్వామిరామానంద తీర్థ సంస్థకు అభ్యర్థులు తమ విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచిం చారు. వివరాలకు 91339 08000, 91339 08111 నెంబర్లలో సంప్రదించాలి.