హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కృష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ‘నమస్తే తెలంగాణ’తో కలిసి ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ను ప్రారంభించనున్నది. ఇందుకోసం జనవరి 2న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో అర్హత పరీక్షను నిర్వహించనున్నది. ఈ పరీక్షలో ప్రతిభ కనపర్చిన మొదటి 50 మంది అభ్యర్థులకు పూర్తిగా ఉచితంగా, మిగిలిన ప్రతిభావంతులకు 75% రాయితీతో కోచింగ్ ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 9133237733, 8686233879 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.