హైదరాబాద్, ఫిబ్రవరి 13( నమస్తే తెలంగాణ): న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలను అందించడం అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్లో భాగంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన న్యాయ సేవా కేంద్రంలో పలువురు న్యాయవాదులు పాల్గొని చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కేంద్రం ద్వారా దాదాపు 410 మంది తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ప్రజలకు సేవలందించిన పలువురు న్యాయవాదులకు సోమవారం లీగల్ సర్వీసెస్ అథారిటీ సర్టిఫికెట్, మెమెంటోలను అందజేసింది. కార్యక్రమంలో పలువరు న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.