జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 27: జగిత్యాలలోని ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా), రోటరీ క్లబ్, పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో 23 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఆదివారం ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కంటి సమస్యలతో ఇబ్బం దిపడే వారు అధికంగా ఉన్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించినట్టు చెప్పారు. ఇందుకోసం కంటి వెలుగు వంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలో మూడున్నర కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ల అద్దాలు అందజేశారని తెలిపారు. ఆపరేషన్ చేయించుకొన్న వారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.