వరంగల్ : ప్రభుత్వ ఉద్యోగార్థులకు కాకతీయ యూనివర్సిటీ శుభవార్త వినిపించింది. వర్సిటీలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో ఉచిత కోచింగ్ను కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ తాటికొండ రమేశ్ మాట్లాడుతూ.. ఉత్తమమైన ఫ్యాక్టలీతో కోచింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాంపస్లోని మెయిన్ లైబ్రరీలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క అభ్యర్థి చిత్తశుద్ధితో చదివి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వీసీ పిలుపునిచ్చారు.
ఈ ఉచిత కోచింగ్ మూడు నెలల పాటు కొనసాగుతుందని కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్స్ సెల్ డైరెక్టర్ డాక్టర్ టీ నాగయ్య వెల్లడించారు. ఈ ఉచిత కోచింగ్కు 800 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్రొఫెసర్ రామచంద్రం, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ బ్రహ్మేశ్వరి, డాక్టర్ సబితా జ్యోత్స్నం, డాక్టర్ సుజాత, డాక్టర్ వాసుదేవ రెడ్డి, డాక్టర్ మధుకర్, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్, డాక్టర్ సుచిత్రా పాల్తో పాటు తదితరులు పాల్గొన్నారు.