Telangana | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తమ సంస్థలను రాష్ట్రంలో స్థాపించి, కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
తాజాగా మరో మెగా పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ గురువారం ప్రకటించింది. ఈ మేరకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR )తో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ( Young Liu )భేటీ అయి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ఫాక్స్ కాన్ ప్రకటించింది.
తెలంగాణలో ఫాక్స్ కాన్ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. లక్ష మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన అనంతరం ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రకటించారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Super stoked to announce a mega investment by @HonHai_Foxconn in Telangana that will create employment for a whopping One Lakh youngsters in Telangana 😊
The announcement is made after Chairman of FoxConn Mr Young Liu met Hon’ble CM Sri KCR Garu at Pragathi Bhavan today pic.twitter.com/zzFAnBxcvz
— KTR (@KTRBRS) March 2, 2023