న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ప్రపంచానికి మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. ఇప్పటికే అమెరికా, యూకే సహా పలు దేశాలు కొవిడ్ నాలుగో డోసుకు అంగీకారం తెలిపాయి అయితే భారత్లో సైతం నాలుగో డోస్కు అనుమతి ఇవ్వాలని హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్గాలు చేస్తున్న డిమాండ్పై నిపుణులు కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ డిమాండ్ అసంమజసమైనదని, దేశంలో బూస్టర్ డోస్ పంపిణీయే ఇంకా పూర్తికాలేదని వారంటున్నారు.
కచ్చితమైన సమాచారం లేనప్పటికీ దేశంలో 22.35 కోట్ల బూస్టర్ డోసులను వినియోగించారని అంచనా. అంటే దేశంలో సుమారు 27 శాతం మందికి మాత్రమే బూస్టర్ డోస్ అందింది. మరి మిగిలిన వారి మాటేమిటి? ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో డోస్కు ప్రభుత్వం అనుమతి ఇస్తే మిగిలిన వర్గాలు భయాందోళనకు గురయ్యే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ చాలామంది కనీసం మొదటి డోస్ కూడా తీసుకోని వారుండటం విస్మయపరిచే విషయం. ఈ పరిస్థితిల్లో ప్రభుత్వం తొలుత నూరు శాతం వేక్సినేషన్పై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.