మెదక్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : దొంగతనం చేశాడనే అనుమానంతో ఇటీవల మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ఖాన్ను పోలీసులు తీవ్రంగా చితకబాదడంతో.. తీవ్ర అనారోగ్యం బారిన పడి హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన ఐజీ.. మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ మధు, ఎస్ఐ రాజశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లు పవన్, ప్రశాంత్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.