ఇల్లందకుంట, జనవరి 11: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంసిరిసేడు, బోగంపాడులో భూకబ్జా కోసం ప్రకృతి వనాలను ధ్వంసం చేసిన నలుగురు వ్యక్తులను రిమాండ్కు తరలించినట్టు హుజూరాబాద్ ఏసీపీ జీవన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఇల్లందకుంట పోలీస్స్టేషన్లో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరిసేడు, బోగంపాడు గ్రామాలకు ప్రకృతి వనాల పెంపకం కోసం సిరిసేడు శివారులో 20 గుంటల చొప్పున ఎకరం కేటాయించగా, 4,430 మొక్కలు నాటారు.
కాగా, సిరిసేడుకు చెందిన రేణుకుంట్ల చిన్నరాయుడు, రామస్వా మి కలిసి ప్రకృతి వనాల్లోని చెట్లను తొలగించి భూమిని కబ్జా చేయడానికి గ్రామానికే చెందిన ఎక్స్కవేటర్ యజమాని రమేశ్కు 10 వేలు ఇచ్చారు. ఈ నెల 7న ప్రకృతి వనాల్లోని 4,430 చెట్లను తొలగించి భూమిని చదును చేశారు. పంచాయతీ కార్యదర్శులు అంకూస్, శ్రీనివాస్ ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి, రేణుకుంట్ల చిన్నరాయుడు, రామస్వామి, రమేశ్, డ్రైవర్ శశికుమార్ను నిందితులుగా గుర్తించారు. గురువారం వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.