సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి శ్లాబ్(Church slab collapsed) కూలి పోవడంతో సుమారు 11 మందికి గాయాలయ్యాయి. బాధితులలో నలుగురికి తీవ్రగాయాలవడంతో వారికి చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy district) జిల్లా కోహీర్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. శిథిలాల్లో మరో నలుగురు చిక్కుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.