ముప్కాల్, ఆగస్టు 10: అదుపుతప్పిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టగా నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకొన్నది. మృతులు హైదరాబాద్, మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్లోని టోలీచౌకీకి చెందిన మిన్హాజ్ బేగం కొడుకులు అహిల్ అహ్మద్, సయ్యద్ ఆదిల్, సయ్యద్ ఉమేర్, కూతుర్లు సయ్యద్ సాదియా, ఫిజ్లాతోపాటు సోదరుడు సయ్యద్ సమితో కలిసి మహారాష్ట వార్ధాలోని తన పుట్టింటికి కారులో బయల్దేరారు. ముప్కాల్ సమీపంలో ఉదయం 6 గంటల సమయంలో వీరి కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ అవతలి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదంలో మిన్హాజ్ బేగం (39), సయ్యద్ సమి (32), అహిల్ అహ్మద్ (6), ఫిజ్లా (2 నెలలు) దుర్మరణం చెందారు. సయ్యద్ సాదియా, సయ్యద్ ఆదిల్, సయ్యద్ ఉమేర్కు గాయాలయ్యాయి.