ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ కేంద్రాల్లో తొలిరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తొలిరోజు చవితి కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేదు. శనివారం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నది.
ఇదిలా ఉండగా మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు అభ్యర్థుల ఎంపికకు మల్లాగుల్లాలు పడుతున్నాయి. నామినేషన్ దాఖలుకు రెండు రోజుల్లో గడువు ఉండడంతో అభ్యర్థుల కోసం వెతులాట ప్రారంభించాయి.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు 15 నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది.
ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు