నాంపల్లి కోర్టులు, జూన్ 3 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో డీఈ సహా మరో నలుగురిని ఆరు రోజుల సిట్ కస్టడీకి కోర్టు అప్పగిస్తూ శనివారం 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీఈ పూల రమేశ్కుమార్, పరీక్ష కేంద్రంలో చాట్జీపీటీ సహకారంతో సమాధానాలు రాసిన ఎం ప్రశాంత్ అలియాస్ చంటి, మహేశ్, వీ నరేశ్తో పాటు పేపర్ కొనుగోలు చేసిన జీ శ్రీనివాస్నాయక్ను 4 నుంచి 9 వరకు సాయంత్రం 5 గంటలలోపు కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. కేతావత్ శాంతి తరఫున వేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కోస్గి వెంకట జనార్దన్, తండ్రి మైబయ్య, రవికుమార్, భగవంత్కుమార్ తరఫున వేసిన బెయిల్ పిటీషన్ల వాదనల కోసం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.