Road Accident | నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం అదుపు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తండ్రికొడుకులు హంద్రీరాజు, నోయల్గా గుర్తించారు. గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం గ్రామీణ మండలం పెన్నకల్లు వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు కూసుమంచి మండల వాసులు రాజు, కాంతమ్మగా గుర్తించారు. ఆయా ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.