వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెల 8న వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురంలో చేపట్టనున్న రైల్వే పీరియాడికల్ వ్యాగన్ వర్క్షాప్, దీనికి అనుబంధంగా ఉండే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. మోదీ పర్యటన ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆయా జిల్లాల అధికారిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.