ఖైరతాబాద్, సెప్టెంబర్ 30: వీరశైవ లింగాయత్లకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం కోకాపేట్లో శ్రీ బసవేశ్వర ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధిం చిన బ్రోచర్లను శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, సంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షుడు బెడకాని హనుమంత్తో కలిసి ఎంపీ బీబీ పాటిల్ ఆవిష్కరించారు. వీరశైవ లింగాయత్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని, ఎకరం స్థలం, భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించడం గొప్ప విషయమని ఎంపీ పేర్కొన్నారు. ట్యాంక్బండ్పై బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయనున్నదని చెప్పారు.