హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సర్పంచులు (Former Sarpanches) సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లుల కోసం పోరుబాటపట్టారు. చల్ హైదరాబాద్కు పిలుపునిచ్చారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వనున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ హోటల్లో సమావేశమైన మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యాక్షులు గుండి మధుసూదన్ రెడ్డి, రేపాక నాగయ్య, గుర్రాలదండి ఆంజనేయులు, దుంప ఆంజనేయులుతోపాటు పలువురు మాజీ సర్పంచులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా, తమ పదవీకాలం ముగిసి 9 నెలలు కావస్తున్నా పెండింగ్ బిల్లుల విడుదల చేయడం లేదని మాజీ స్పరంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల విడుదల కోసం ఇప్పటికే గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. గత ఆగస్టులో అసెంబ్లీని ముట్టడించారు. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన వారని పోలీసులు అరెస్టు చేశారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాట కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లు
పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్ లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్కు వచ్చిన మాజీ సర్పంచ్లు pic.twitter.com/F7cZgq9DaF
— Telugu Scribe (@TeluguScribe) November 4, 2024