హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన భవిష్యత్తు వ్యూహాలపై ఇరువురు చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగు పరిచేందుకు రఘురామ రాజన్ పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.