హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆకుపచ్చని హరితవ్యాప్తికి పిల్లలే దూతలని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. విత్తనం నుంచి మొక, మొక నుంచి మహావృక్షం ఎదిగినట్టుగానే, పర్యావరణ బ్రాండ్ అంబాసిడర్లుగా పిల్లలు ఎదుగుతూ తమ పరిసరాలను హరితమయం చేస్తారని, అందుకు పెద్దలు సహకరించాలని ఉద్బోధించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో శనివారం నిర్వహించిన శ్రీకల్పతరు సంస్థాన్ గ్రీన్ ఐడల్ అవార్డు కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. తన పదవీకాలంలో దేశంలోనే అత్యధిక మొకలు నాటడమే కాకుండా, నాటేందుకు ప్రేరణగా నిలిచినందుకు శ్రీకల్పతరు సంస్థాన్ మాజీ ఎంపీ సంతోష్కుమార్కు విశిష్ట పురసారం అందజేసింది. ఆయనకు రాజస్థాన్ గవర్నర్ హరిబావ్బాగ్డే అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం తాను చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు స్ఫూర్తి అని వివరించారు. కేసీఆర్ చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరిగిందని తెలిపారు. పర్యావరణ ప్రాముఖ్యంపై విద్యార్థులు, చిన్నారుల్లో ఆసక్తి పెంచేందుకు వారి కరిక్యులంలో పర్యావరణ అంశాలను బోధించడంతోపాటు వారికి క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ హితానికి అనువైన కార్యాచరణను పిల్లల నిత్య జీవితంలో భాగం చేయాలని అభిలషించారు. అనంతరం రాజస్థాన్ గవర్నర్ గ్రీన్ బచ్పన్ చాంపియన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగటివార్, ట్రీ మ్యాన్ అఫ్ ఇండియా విష్ణులంబా తదితరులు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణం కోసం పనిచేస్తున్న పలు సంస్థలను, పర్యావరణవేత్తలను సన్మానించారు.