హైదరాబాద్ : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని తెలంగాణ భవన్ కార్యాలయ ప్రాంగణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24 న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.