కృష్ణ కాలనీ, డిసెంబర్ 26 : పాలనలో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్ అయ్యారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి మాటలను కాంగ్రెస్ నాయకులే వెక్కిరిస్తున్నారని, ఆ పార్టీలో భవిష్యత్ లేదని బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయమని స్పష్టంచేశారు. 3వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లలమర్రి శారదానారాయణ, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు రాజునాయక్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు.