హైదరాబాద్ డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మాజీ మం త్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఓఎస్డీ కల్యాణ్కుమార్ హైకోర్టు లో పిటిషన్ దాఖలుచేశారు. 3రోజుల క్రితం పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయిన ఉదంతంలో కల్యాణ్పై పోలీసులు కేసు నమో దు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను తీసుకెళ్లారని, మిగతా ఫైళ్లను చిందరవందరగా పడేశారని పేరొన్నారు. ఆఫీస్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కల్యాణ్తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు.