వనపర్తి, డిసెంబర్ 8 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Niranjan Reddy) తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. పలువురు నేతలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, ఎంపీపీ కృష్ణానాయక్, మీడియా కన్వీనర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.