వనపర్తి : తెలంగాణలో పంటల మార్పిడిని(Crop rotation) ప్రోత్సహించాం. ఆయిల్ పామ్ సాగుతో అనేక లాభాలు ఉంటాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) అన్నారు. వనపర్తి(Wanaparthi) మండలం చిట్యాల సమీపంలో రైతు ముష్టి బాలీశ్వర్ ఐదెకరాల్లో సాగు చేసిన ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ను పంటను ప్రోత్సహించిందన్నారు.
జిల్లాలో దాదాపు 14 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. 2 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుతో దేశంలోనే అగ్ర స్థానంలో తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతోనే రైతాంగానికి గిట్టుబాటు ధర
లభిస్తుందన్నారు. ఆయిల్ పామ్లో అంతరపంటగా వేరుశెనగను వేసినప బాలీశ్వర్ను అభినందించారు.