హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు శనివారం ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యా సంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ రా రైస్ మాత్రమే కావాలంటే ని బంధనల ప్రకారం కాకుండా ఎంత సీఎంఆర్ వ చ్చినా ఎఫ్సీఐ తీసుకోవాలని, వచ్చే న ష్టాన్ని కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ నెలకొల్పిన ఉద్దేశం మంచిదే అయినా ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారిందని ఆరోపించారు. కొందరి అవినీతి, కొనుగోలు, నిల్వల్లో నిర్లక్ష్యంతో ఆశించిన ఫలితాలను సా ధించలేకపోతున్నదని చెప్పారు. రైతుల సంక్షేమా న్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులు ప్రోత్సహించాలని కోరారు.