మహబూబ్నగర్ : ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల(Jadcherla) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని, ఎవరు కూడా అధైర్య పడవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Former Minister Lakxmareddy) అన్నారు. గురువారం లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, పార్టీ ఎల్లపుడూ మీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే ప్రతిపక్ష పాత్రలో సమర్థవంతంగా ప్రభుత్వ తీరును ఎండగడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేస్తే ఎప్పుడూ ఆదరిస్తారన్నారు.