KTR | హైదరాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ): ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారులను నిలదీశారు. కవితను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఈడీ అధికారులతో కేటీఆర్ వాదనకు దిగారు. పలు అంశాలపై ఈడీ అధికారిణి భానుప్రియ మీనా ను ప్రశ్నించారు. కవిత అరెస్ట్ విషయాన్ని తెలుకున్న కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి బంజారాహిల్స్లోని కవిత ఇంటికి వచ్చారు. అయితే వీరిని ఇంట్లోకి రానివ్వకుండా పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. చాలా సమయంపాటు అక్కడే వేచి చూసిన కేటీఆర్, హరీశ్రావును చివరికి ఇంట్లోకి అనుమతించారు. ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్.. విచారణ అధికా రి భానుప్రియ మీనాతో మాట్లాడారు.
బహిరంగంగానే ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవితను అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు మాటిచ్చిన ఈడీ.. ఇప్పుడెలా అరెస్ట్ చేస్తున్నదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటను తప్పుతు న్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బెయిల్ రాకుండా కుట్ర చేసిన అధికారులు కావాలనే శుక్రవారం నాడు అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంట్లోకి రాకుండా నిర్బంధం వి ధించారని మండిపడ్డారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావ ద్దు అంటూ ఈడీ అధికారులు తమకు హు కుం జారీ చేయడంపై తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తంచేశారు. తన తొందరపాటు, దుందుడుకు చర్యలపై ఈడీ సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. కవిత అరెస్ట్ అనంతరం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కవితను ట్రాన్సిట్ వారంట్ లేకుండానే అదుపులోకి ఎలా తీసుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసలు ‘ట్రాన్సిట్ వారెంట్’ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా కేసులో నిందితుడి మీద ఒక రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ నమోదు చేస్తే.. అతడు వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి, కేసు నమోదైన రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు తప్పనిసరిగా స్థానిక కోర్టు అనుమతి తీసుకోవాలి. దాన్నే ‘ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్’ అని అంటారు. ఎమ్మెల్సీ కవిత మీద ఢిల్లీలో కేసు రిజిస్టర్ అయింది. అయితే ఆమెను ఈడీ అధికారులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆమెను స్థానిక కోర్డులో ప్రవేశపెట్టాలి. కోర్టు ట్రాన్సిట్ ఆర్డర్ ఇస్తే అప్పుడు కవితను ఢిల్లీకి తీసుకెళ్లొచ్చు. కానీ, ఈ పద్ధతులేవీ పాటించకుండా కవితను ఢిల్లీకి తరలించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.