దేవరుప్పుల, జనవరి 20 : రాజకీయ వే ధింపులే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, సీఎం కుర్చీకి తగని వ్యక్తి రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మంగళవారం జనగా మ జిల్లా దేవరుప్పులలో ఆయన మాట్లాడా రు. బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టాలనడం రే వంత్ దిగజారుడుతనానికి నిదర్శనమని పే ర్కొన్నారు. మరోవైపు పసలేని ఫోన్ట్యాపింగ్ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చి మున్సిపల్ ఎన్నికల వేళ డైవర్షన్ రాజకీయలకు తెరలేపుతున్నాడని ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రె స్ వైఫల్యాలను ఎండగడు తూ, మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజలపక్షాన నిలి చి పోరాడుతున్న హరీశ్రావు ధాటికి రేవంత్ వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే ఫోన్ ట్యాపింగ్ నో టీసులిప్పించి విచారణకు పిలుస్తున్నారని పే ర్కొన్నారు. నేరుగా ఎదుర్కొనే దమ్ములేని కాం గ్రెస్, తప్పుడు కేసులుతో కక్షసాధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.